రైల్వేట్రాక్‌ లింక్‌ మధ్యలో సిమెంట్‌ రాయి కలకలం | - | Sakshi
Sakshi News home page

రైల్వేట్రాక్‌ లింక్‌ మధ్యలో సిమెంట్‌ రాయి కలకలం

Jun 8 2025 1:06 AM | Updated on Jun 8 2025 1:06 AM

రైల్వేట్రాక్‌ లింక్‌ మధ్యలో సిమెంట్‌ రాయి కలకలం

రైల్వేట్రాక్‌ లింక్‌ మధ్యలో సిమెంట్‌ రాయి కలకలం

తిరుత్తణి: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ లింగ్‌ మధ్యలో సిమెంట్‌ రాయి ఉండగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి రైల్వేస్టేషన్‌కు సమీపంలో శనివారం ట్రాక్‌ లింక్‌ మధ్యలో గులకరాయిలుండడంతో రైల్వే టెక్నికల్‌ కార్యాలయంలో సిగ్నల్‌ రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబయి నుంచి చైన్నెకి వస్తున్న రైలు వేగాన్ని తగ్గించారు. వెంటనే రైల్వే అధికారులు తిరుత్తణి రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ తనిఖీలు చేపట్టి లింక్‌కు మధ్యలో ఉన్న సిమెంట్‌ రాయిని గుర్తించి, తొలగించారు. అనంతరం ముంబయి మెయిల్‌ తిరుత్తణి రైల్వేస్టేషన్‌ దాటుకుని చైన్నెకి వెళ్లింది. ట్రాక్‌ లింక్‌ మధ్యలో రైలు వేగానికి అప్పుడప్పుడు చిన్న రాళ్లు పడడం జరుగుతుందని, అయితే సిమెంట్‌ రాయి ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌లో రాయి గుర్తింపు సంఘటనకు సంబంధించి రైల్వే అధికారులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దీంతో తిరుత్తణి మార్గంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు యథాప్రకారం సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement