ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

Jun 8 2025 1:06 AM | Updated on Jun 8 2025 1:06 AM

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

కుమారుడికి తీవ్రగాయాలు

తిరువళ్లూరు: ఇంటి వద్ద అనుమతి లేకుండా 30 అడుగుల మేరకు బావి తవ్వుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన కుమారుడిని రక్షించడానికి యత్నించిన తండ్రి మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కొడుకును రక్షించిన బంధువులు చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని ముదుకూరు ప్రాంతానికి చెందిన జ్యోతి(61) తన ఇంటికి సమీపంలో మూడు అడుగుల వెడల్పుతో 30 అడుగుల లోతు బావి తవ్వకం పనులు చేపట్టాడు. బావి తవ్వతున్న సమయంలో జ్యోతిరామన్‌ కుమారుడు సంతోష్‌కుమార్‌(35) ప్రమాదవశాత్తు బావిలో పడి పోయాడు. విషయాన్ని గుర్తించిన జ్యోతి అలియాస్‌ జ్యోతిరామన్‌ కొడును రక్షించే క్రమంలో అతను సైతం బావిలోకి దిగే క్రమంలో పడిపోయాడు. ఇద్దరు బావిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికుడు బాలాజీ గ్రా మస్తుల సాయంతో సంతోష్‌, జ్యోతిని బావిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే అత డు మరణించినట్టు వై ద్యులు నిర్ధారించారు. తీవ్రం గాయపడిన సంతోష్‌కుమార్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రజినీకాంత్‌, మప్పేడు రెవెన్యూ ఇన్పెక్టర్‌ భారతీప్రియ, వీఏఓ గుణ స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టిన బావిని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతుడి బఽంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement