
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
వేలూరు: పట్టణంలో సబ్వేలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి ఏవా వేలు అన్నారు. వేలూరు పట్టణంలో రూ.150 కోట్ల వ్యయంతో 250 పడకల వసతితో కూడిన ప్రభుత్వ పెండ్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి నిర్మా ణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంత్రి తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అన్ని జిల్లాలోను సబ్వేలు ఏర్పాటు పనులు చేయడం జరిగిందన్నారు. అలాగే అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేలూరు పట్టణంలో నిర్మిస్తున్న ఆస్పత్రిని త్వరలోనే ముఖ్యమంత్రి చే తుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అందుబా టులో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ప్రస్తుతం ఏడు అంతస్తులతో ఆస్పత్రిని నిర్మించి, రోగులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. పలు మార్లు నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉపాధి హామి పథకం, విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. గతంలో తుపాను బాధితులను ఆదుకోవాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, విల్వనాథన్, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, యూసిఫ్కాన్, చీఫ్ ఇంజనీర్ మణివణ్ణన్, ఇంజినీర్ మణిగండన్ పాల్గొన్నారు.