
కలైపులి శేఖరన్ కథ చెబితే మర్చిపోలేం..
తమిళసినిమా: నటుడు, నిర్మాత, దర్శకుడు, చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కలైపులి శేఖరన్ అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు శనివారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సంఘం నేతత్వంలో స్మారకాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నిర్వాహకులు కె.రాజన్, పి.ఆంథోని దాస్, ఎస్.నందు గోపాల్, యు.తరుణ్ కుమార్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా కలైపులి శేఖరన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయనతో అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సందర్భంగా నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ తనకు తోడపుట్టని సహోదరుడు కలైపులి శేఖరన్ అని పేర్కొన్నారు.1973వ సంవత్సరం నుంచి ఆయనతో పరిచయం ఏర్పడిందన్నారు. తనకు ఆయనతో పలు మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. పరుమార్లు తన కార్యాలయంలోనే తామిద్దరూ కలిసి భోజనం చేసేవారని చెప్పారు. ఆయన చెప్పే కథలు విని ఆశ్చర్యపోయేవాడు అన్నారు. కలైపులి శేఖరన్ చెప్పే కథలు విని ఎవరూ అంత సులభంగా మరిచిపోరన్నారు. అంత ప్రతిభావంతుడు ఆయన పేర్కొన్నారు. రజినీకాంత్, కమలహాసన్, ప్రభుదేవా, కార్తీక్ వంటి ప్రముఖ నటులకు కలైపులి శేఖరన్ కథలు చెప్పారన్నారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేయనప్పుడు తాను వెళ్లి ఆయన్ని పరామర్శించానని, ఆ సమయంలో ఆయన తన ముందు కొన్ని కోరికలను ఉంచారని, వాటిని తాను నెరవేర్చినట్లు చెప్పారు. కలైపులి శేఖరన్ లేని లోటును ఎవరు తీర్చలేరని కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు. అదేవిధంగా దర్శక నిర్మాత కేఆర్, దర్శకుడు వి.శేఖర్, కె.రాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు కలైపులి శేఖరన్తో తమ అనుభవాలను పంచుకున్నారు.