రైతు హత్య కేసులో అన్నదమ్ములకు యావజ్జీవం | - | Sakshi
Sakshi News home page

రైతు హత్య కేసులో అన్నదమ్ములకు యావజ్జీవం

Sep 27 2023 12:38 AM | Updated on Sep 27 2023 12:38 AM

అన్నానగర్‌: రైతును హత్య చేసిన కేసులో అన్నదమ్ములకు మంగళవారం విరుదాచలం కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం పక్కనే ఉన్న శ్రీముష్ణం సమీపంలోని కొలతం గురిచ్చి గ్రామానికి చెందిన రాజేంద్రన్‌ (55) రైతు. అర్జునుడి కుమారులు రామకృష్ణన్‌ (34), సుందరరాజన్‌ (35) అతని ఇంటి సమీపంలోనే నివసిస్తున్నారు. ఈక్రమంలో రాజేంద్రన్‌ ఇంట్లోని కొబ్బరిచెట్టుపై నుంచి కొబ్బరికాయలు పడే విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో 2021 ఆగస్టులో రాజేంద్రన్‌ ఇంట్లో ఉండగా.. రామకృష్ణన్‌, సుందరరాజన్‌ వెళ్లి..మీ చెట్టు నుంచి కొబ్బరి కాయ మా స్థలంపై పడింది. ఆ చెట్టును నరికివేయమని చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన రామకృష్ణ, సుందరరాజన్‌ రాజేంద్రన్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేంద్రన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేంద్రన్‌కుమారుడు రాజేష్‌ ఫిర్యాదు మేరకు శ్రీముష్ణం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ విరుదాచలం జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టులో కొనసాగుతోంది. సోమవారం ఈ కేసు విచారణ ముగిసిన అనంతరం న్యాయమూర్తి ప్రభా చంద్రన్‌ తీర్పు వెలువరించారు. నిందితులు రామకృష్ణన్‌, సుందరరాజన్‌ రాజేంద్రన్‌ను హత్య చేసినట్లు రుజువు కావడంతో ఇద్దరికీ యావజ్జీవ శిక్ష పాటు రూ.6,000 జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement