నిర్మాతగా మారిన యష్‌ తల్లి | - | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారిన యష్‌ తల్లి

May 25 2025 7:26 AM | Updated on May 25 2025 7:26 AM

నిర్మాతగా మారిన యష్‌ తల్లి

నిర్మాతగా మారిన యష్‌ తల్లి

తమిళసినిమా: కేజీఎఫ్‌1, 2 చిత్రాలతో పాన్‌ ఇండియా కథానాయకుడిగా క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు యష్‌. కాగా ఈయన తల్లి పుష్పాఅరుణ్‌ కుమార్‌ ఇప్పుడు నిర్మాతగా అవతారం ఎత్తారు. ఇంతకుముందు దివంగత నటుడు రాజ్‌ కుమార్‌ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే నటుడు యష్‌ తల్లి పుష్పాఅరుణ్‌ కుమార్‌ చిత్రం నిర్మాణాన్ని ప్రారంభించడం విశేషం. ఈ సంస్థలో యువ నటీనటులకు, నూతన సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పిస్తూ కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో జనరంజకమైన కథా చిత్రాలు నిర్మించడానికి సిద్ధమైనట్లు ఆమె మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పృథ్వీ అంబార్‌ హీరోగా నటిస్తుండగా కావ్య షైలీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటుడు గోపాల్‌ దేశ్‌ పాండే, రాజేష్‌ నటరంగ, అవినాష్‌, మన్సీ సుధీర్‌, రఘు రమణ గొప్పా, సేతన్‌ గాంధర్వ తదితరులు బుక్కి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరాజ్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే మూర్ఖత్వం, సెంటిమెంట్‌, యాక్షన్‌ వంటి కమర్షియల్‌ అంచాలతో జనరంజక కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని, తాజాగా టీజర్‌ను విడుదల చేసినట్టు చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుందనే దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పుష్పా అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

యష్‌ తల్లి పుష్పాఅరుణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement