అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శిపై కేసు నమోదు

Sep 21 2023 12:58 AM | Updated on Sep 21 2023 12:58 AM

- - Sakshi

కొరుక్కుపేట: అన్నా జయంతి సందర్భంగా జిల్లా అన్నాడీఎంకే తరఫున కురిచ్చిలో మంగళవారం రాత్రి బహిరంగ సభ జరిగింది. జిల్లా కార్యదర్శి కుమారగురు మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌న్‌, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌న్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీంతో గత రాత్రి కళ్లకురుచ్చి డీఎంకే సౌత్‌ యూనియన్‌ కార్యదర్శి వెంకటాచలాన్ని కొందరు న్యాయవాదులు కుమారగురుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రవిచంద్రన్‌, ఎస్‌ఐ సత్య శీలన్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకునే క్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజవేలను పోలీస్‌స్టేషన్‌న్‌కు పిలిపించి సలహా తీసుకుని కేసు నమోదు చేశారు.

విగ్రహాలు లభ్యం

అన్నానగర్‌: పేరిగై సమీపంలో బుధవారం ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతుండగా మూడు విగ్రహాలు లభ్యమయ్యాయి. కృష్ణగిరి జిల్లా పరికై సమీపంలోని అత్తిముగం గ్రామానికి చెందిన కృష్ణన్‌ (35). బుధవారం తన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు పునాది తవ్వే పనిలో నిమగ్నమయ్యాడు. అప్పుడు భూగర్భంలో మూడు స్వామి విగ్రహాలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న చూళగిరి తహసీల్దార్‌ శక్తివేల్‌ సంఘటన స్థలానికి వెళ్లి విగ్రహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement