ఉద్రిక్తత నడుమ ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత నడుమ ఆక్రమణల తొలగింపు

Jun 3 2023 1:36 AM | Updated on Jun 3 2023 1:36 AM

అధికారులతో స్థానికుల వాగ్వాదం  
 - Sakshi

అధికారులతో స్థానికుల వాగ్వాదం

తిరువళ్లూరు: ఆలయానికి వెనుక ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన మరుగుదొడ్డిని ఉద్రిక్తత నడుమ అధికారులు తొలగించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయం వుంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వెనుక భాగాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకుని వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించారు. అయితే గర్బగుడికి నేరుగా మరుగుదొడ్ది, సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన స్థానికులు గత సోమవారం గ్రీవెన్స్‌డేలో వినతి పత్రం సమర్పించారు. ఈ వినతిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ మదియళగన్‌ను కలెక్టర్‌ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లి భూసర్వే నిర్వహించారు. జేసీబీతో తొలగించారు. ఈ సమయంలోఉద్రిక్తత నెలకొంది. కొంతమందిని మరుగుదొడ్డిని తొలగించాలని, మరికొందరు తొలగించకూడదని రెవెన్యూ అఽధికారులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు ఆక్రమణలను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement