బడి పిలుస్తోంది! | - | Sakshi
Sakshi News home page

బడి పిలుస్తోంది!

Jun 12 2025 7:29 AM | Updated on Jun 12 2025 7:29 AM

బడి ప

బడి పిలుస్తోంది!

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఫ ఏరువాక పౌర్ణమి

గురువారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2025

రేపు తెలంగాణ

ఉద్యమకారుల ధర్నా

సూర్యాపేట : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.

విద్యార్థుల సంఖ్యను

పెంచాలి

నడిగూడెం : జిల్లాలో 2025–06 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసచారి, డిప్యూటీ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ కోరారు. బుధవారం నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత బాధ్యత తీసుకొని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ అకడమిక్‌ క్యాలెండర్‌తో పాటు, పాఠశాల స్థాయి ప్రణాళికలతో విద్యా సంవత్సరాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయి ఈశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు

దూరంగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో నిర్వహించిన పోలీస్‌ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజానికి రోగం వస్తే బాగు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాలు జరగకుండా చేయడం తమ బాధ్యతఅని, రోజూ రాత్రి పగలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. నేరాలు జరగకుండా ముందస్తుగా అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు విధుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం అంతా రోడ్డున పడుతారన్నారు. ఏదైనా సంఘటన జరిగితే 100 కు ఫోన్‌ చేసి పోలీస్‌ సేవలు పొందాలని సూచించారు. అత్యాశకు పోయి సైబర్‌ మోసగాళ్లకు చిక్కితే ఆర్థికంగా లూటీ చేస్తారన్నారు.

సూర్యాపేటటౌన్‌ : పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. నెల ఇరవై రోజుల పాటు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేలా రంగు కాగితాలు, మామిడితోరణాలు, కొబ్బరి మట్టలతో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు.

తొలిరోజే పుస్తకాలు, యూనిఫాం పంపిణీ..

ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌తో పాటు యూనిఫాం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 4,65,600 పాఠ్యపుస్త కాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 3,24,875 పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాలు జిల్లా గోదాం నుంచి ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాఠశాలలకు చేర్చారు. అలాగే 49,374 మంది విద్యార్థులకు ఒక్కో జత చొప్పున ఇచ్చేందుకు యూనిఫాం సిద్ధం చేశారు. వీటిని స్వయం సహాయక సంఘాలు, మెప్మా సిబ్బందితో కుట్టించారు.

రెతులు స్థానికంగానే

విత్తనాలు కొనుగోలు చేయాలి

నూతనకల్‌: రైతులు స్థానికంగానే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి సూచించారు. బుధవారం నూతనకల్‌ మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము సాగు చేసే విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల వాటి నాణ్యత ప్రమాణాలు తెలియక పంట దిగుబడిరాక నష్టపోతున్నారని ఆయన చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ల నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు రసీదును భద్రపర్చుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి మురళీబాబు, దుకాణ యజమానులు తదితరులు ఉన్నారు.

అధ్యాపకులదే బాధ్యత

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అధ్యాపకుల దేనని డీఐఈఓ భానునాయక్‌ గుర్తు చేశారు. బుధవారం ఆత్మకూర్‌ మండల పరిధిలోని నెమ్మికల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నూతన అడ్మిషన్లను పరిశీలించి మాట్లాడారు.ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు కార్పొరేట్‌ మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ఎందరో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ గునగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు దశరథ, అశోక్‌, లక్ష్మయ్య, నాగార్జున ఉన్నారు.

న్యూస్‌రీల్‌

ఫ మామిడితోరణాలు, రంగుల కాగితాలతో స్కూళ్లు ముస్తాబు

ఫ వేసవి సెలవుల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు

ఫ తొలిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ

ఫ పండుగ వాతావరణంలో

ప్రారంభించేందుకు ఏర్పాట్లు

పాఠశాల పాఠశాలల విద్యార్థుల

సంఖ్య సంఖ్య

ప్రాథమిక 690 34,000

ప్రాథమికోన్నత 78 13,500

జిల్లాపరిషత్‌ ఉన్నత 182 25,000

ఆదర్శ 09 6,500

కేజీబీవీ 19 3700

బడి పిలుస్తోంది!1
1/6

బడి పిలుస్తోంది!

బడి పిలుస్తోంది!2
2/6

బడి పిలుస్తోంది!

బడి పిలుస్తోంది!3
3/6

బడి పిలుస్తోంది!

బడి పిలుస్తోంది!4
4/6

బడి పిలుస్తోంది!

బడి పిలుస్తోంది!5
5/6

బడి పిలుస్తోంది!

బడి పిలుస్తోంది!6
6/6

బడి పిలుస్తోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement