
పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది.. కాటన్, సెమికాటన్, సిల్క్తో అనేక వైరెటీలలో ఇక్కత్ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ప్రపంచంతో పాటు దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఎక్చేంజ్లో చేనేతవస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు.
దేనికై తే పేరుంటుందో వాటికి నకిలీల బెడద
దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రింట్ఫొటోకు, పెయింటింగ్ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్, డుప్లికేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లికి మళ్లీ వస్తానన్నారు.
జూనియర్ కాలేజీకి
కంప్యూటర్ ల్యాబ్ మంజూరు..
చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు ఉపేందర్, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికి నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులు అందజేశారు.
ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్ వస్త్రాలు ధరిస్తున్నారు
ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా
ఫ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
ఫ సతీమణితో కలిసి భూదాన్పోచంపల్లి సందర్శన
చేనేత గృహాల సందర్శన
గవర్నర్ పోచంపల్లికి రాగానే తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్ గృహాలను సందర్శించారు. వారు గవర్నర్ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి ఈ వృత్తిని చేస్తున్నారని, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యుజియంను సందర్శించారు. అక్కడ కొకూన్స్, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేయడం ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్డిజైన్లను చూసి చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, ఆర్డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్, గజం అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్రెడ్డి, తహసిల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, అంకం పాండు పాల్గొన్నారు.

పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్