
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. హుజూర్నగర్లో సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. సోషల్ మీడియా – ప్రాధాన్యత అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, నయా ఉదారవాద విధానాలు అనే అంశంపై కార్మిక సంఘం నేత శివకుమార్, భవిష్యత్ కర్తవ్యాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి వివరించారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వెంకటరెడ్డి, బ్రహ్మం, అనంత ప్రకాష్, యాకూబ్, నగేష్ పాల్గొన్నారు.