
జూన్.. పరేషాన్!
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
రాజీమార్గమే రాజమార్గం
చివ్వెంల(సూర్యాపేట) : రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ కోర్టుల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీతో ఇరు పక్షాల వారు గెలిచిన వారవుతారన్నారు. సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్, వెహికల్ యాక్ట్, గృహహింస, విద్యుత్, చెక్ బౌన్స్, బ్యాంకు కేసులకు సంబంధించి, పరిష్కారమయ్యే కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
అర్వపల్లి: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగిన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పీహెచ్సీలో వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుషిత నీరు, ఆహారంతో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా గర్భిణులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను
జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలో జూలై 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేటలో కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతుల కరపత్రాలు ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో దళితుల జీవితాలు మరింత దుర్భరంలోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 300 మంది కేవీపీఎస్ నాయకులు, కార్యకర్తలు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి, టేకుల సుధాకర్, రవి, తక్కెళ్లపల్లి శ్యామ్, ఇరుగు రమణ, సుంచు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
తాళ్లగడ్డ (సూర్యాపేట) : పేద, మధ్య తరగతికి చెందిన రైతుల కుటుంబాలకు ఖర్చుల గుబులు మొదలైంది. మిగతా సమయంలో నెట్టుకొచ్చిన అన్నదాతలు జూన్ మాసంలో మాత్రం ఆందోళన చెందున్నారు. ఓ వైపు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. మరో వైపు వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు కావాల్సి ఉంటుంది. దీనికితోడు తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించాలి. రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
పంట పెట్టుబడుల సమయం
రోహిణి కార్తె ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగుపనులకు సమాయత్తమయ్యారు. జిల్లాలో సుమారుగా 6,13,000 ఎకరాల సాగుభూమి ఉంది. 3,03,767 మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంతో కాడెద్దుల వ్యవసాయంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. ప్రస్తుతం ట్రాక్టర్ల వాడకం వల్ల ఎకరాకు సుమారుగా రూ.13 వేల వరకు ఖర్చు వస్తుంది. విత్తనాలు, ఎరువులు కలుపుకొని రైతుకు తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అది అమలుకాకపోవడంతోపాటు, ఇచ్చిన పది వేలు కూడా అంతంత మాత్రంగా కొంతమందికే పరిమిత మవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
భారంగా మారిన స్కూల్ ఫీజులు
పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఫీజులతో పాటుగా యూనిఫాం, షూస్, పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు పాఠశాలల్లోనే యాజమాన్యాలు నిర్ణయించిన ధరలకు కొనాల్సి వస్తోంది. దీనికి తోడు రవాణా చార్జీలు అన్నీ కలుపుకొని సుమారు ఎల్కేజీ విద్యార్థికి రూ.40వేల పైచిలుకు ఖర్చు వస్తుంది. 10వ తరగతి అయితే రూ.లక్ష దాటాల్సిందే.
ఫ ఇంటర్ బోర్డు డిప్యూటీ
సెక్రటరీ హేమచందర్
నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ అందించేందులా కొత్త మెనూ తీసుకొచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో బుధవారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎక్స్ బిర్యానీ అందజేశారు. బుధవారం ఎలాగూ గుడ్డు అందించాల్సి ఉన్నందున బిర్యానీ చేసి ప్రతి చిన్నారికి ఒక గుడ్డు అందేలా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు పరిధిలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని మొత్తం 1209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 45,117 మంది చిన్నారులున్నారు.
సాధ్యపడేనా..
ఎగ్ బిర్యానీ వారానికి రెండు సార్లు అందించాలని ఇటీవల ప్రతిపాదించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యపడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారం పంపిణీకి సంబంధించిన నిధులు పెంచకుండా నాణ్యమైన ఆహారంతో పాటు ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ ఏర్పాటు ఎలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల నిర్వాహకులు దీనిని అంగీకరిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారానికి రెండు సార్లు పెడతారా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫ వర్షాకాలంలో కలుషిత నీటితో
పొంచిఉన్న ముప్పు
ఫ డయేరియా, టైఫాయిడ్,
కామెర్ల బారిన పడే ప్రమాదం
విమాన ప్రమాద ఘటనపై
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
సూర్యాపేట అర్బన్ : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిపోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.
న్యూస్రీల్
ఫ ఇదే నెలలో వ్యవసాయ పెట్టుబడులు.. పిల్లల స్కూల్ ఫీజులు
ఫ రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్న రైతులు
ఫ రుణాల కోసం బ్యాంకుల
చుట్టూ ప్రదక్షిణలు
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేందాల్లో గుడ్డు బిర్యానీ పెట్టాలని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
– నర్సింహారావు,
జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట
ఫ చిన్నారులకు మరింత పౌష్టికాహారం
అందించాలని నిర్ణయం
ఫ వారానికి రెండు రోజులు పంపిణీ
ఫ 45,117 మంది చిన్నారులకు ప్రయోజనం
జిల్లాలో ఇలా...
ప్రాజెక్టులు 05
అంగన్వాడీ
కేంద్రాలు 1209
చిన్నారులు 45,177
గర్భిణులు 5220
బాలింతలు 4236

జూన్.. పరేషాన్!

జూన్.. పరేషాన్!

జూన్.. పరేషాన్!

జూన్.. పరేషాన్!

జూన్.. పరేషాన్!