
మహిళ బ్లాక్మెయిల్
చిలుకూరు మండలం సీత్లాతండాలో ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని యువకుడిని బ్లాక్మెయిల్ చేసింది.
- 8లో
సమస్యలతో స్వాగతం..
జిల్లాలో చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 536 అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేయగా అందులో సగం పాఠశాలల్లో ఇంకా పనులు పూర్తి స్థాయిలో కాలేదు. చాలా పాఠశాలల్లో పెయింటింగ్ పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు సమస్యలతో సతమతమవ్వాల్సిందేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం కింద 329 పాఠశాలలను ఎంపిక చేశారు. అయితే ఈ పథకం కింద చేపట్టిన పనులు చాలా పాఠశాలల్లో మధ్యలోనే ఆగిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం పనులను నిలిపివేశారు.