ఉద్యాన రైతులకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన రైతులకు ఊతం

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 7:44 AM

ఉద్యా

ఉద్యాన రైతులకు ఊతం

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన ఇలా..

తీగ జాతి కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన ద్వారా శాశ్వత పందిళ్లను రాయితీపై ఇవ్వనున్నారు. ఈ పథకం కింద 2025–26 సంవత్సరానికి రూ.50 లక్షలతో 100 యూనిట్ల శాశ్వత పందిళ్లను నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్‌కు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఒక్క రైతు 5 యూనిట్ల వరకు రాయితీ పొందే అవకాశముంది.

సూర్యాపేట : ఉద్యాన పంటల సాగుకు ఊతం ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ పథకాలకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు రూ.2429.34 లక్షలను వివిధ పంటల సాగుకు కేటాయించారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం

ఆయిల్‌పామ్‌ సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. గడిచిన మూడేళ్లలో 4,885 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగయ్యేలా జిల్లా రైతాంగానికి వివిధ రాయితీలు ప్రకటించింది. ఆయిల్‌పామ్‌ దిగుబడి వస్తే కొనుగోలుకు జిల్లాకు పతంజలి కంపెనీని కేటాయించారు. ఈ ఏడాది దాదాపు 3వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయించాల్సి ఉంది. దీనికి రైతులకు రాయితీ కింద రూ.1759.37 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది.

సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం

సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయల, పూల సాగుతో పాటు నీటికుంటల ఏర్పాటుకు ఆసక్తి గల రైతులను ప్రోత్సాహంచాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.216.86 లక్షలు కేటాయించింది.

డ్రిప్‌, స్ప్రింక్లర్ల కోసం..

సూక్ష్మ నీటి పారుదల పథకం కింద డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పరికరాలను ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న రైతులు భూమి , నీరు, విద్యుత్‌ వసతులు కలిగి ఉండాలి.

ఫ 2025–26 వార్షిక ప్రణాళిక ఖరారు

ఫ ఈ ఏడాది ఆయిల్‌పామ్‌ లక్ష్యం 3వేల ఎకరాలు

ఫ సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.216.86 లక్షలు కేటాయింపు

ఫ ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తు చేసుకోవాలి

2025–26 సంవత్సరానికి ఉద్యాన పంటల సాగు లక్ష్యాన్ని ఖరారు చేశారు. ఆసక్తి గల రైతులు ఆయా డివిజన్‌ ఉద్యాన అధికారులకు దరఖాస్తు అందించాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నాగయ్య, జిల్లా ఉద్యాన అధికారి

ఉద్యాన రైతులకు ఊతం1
1/1

ఉద్యాన రైతులకు ఊతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement