భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 7:44 AM

భూ సమ

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

నడిగూడెం : భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు తెలిపారు. మంగళవారం నడిగూడెం మండలం రత్నవరంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రత్నవరంలో 113 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, నడిగూడెం తహసీల్దార్‌ వి.సరిత, ఆర్‌ఐ రాంబాబు, సీనియర్‌ అసిస్టెంట్‌ కళ్యాణి, రెవెన్యూ సిబ్బంది సుకేష్‌, భూమేష్‌, రాజు, శరత్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వెంకటసుబ్బారావుకు నివాళి

భానుపురి (సూర్యాపేట) : భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతిని మంగళవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారావు చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ వి.శ్యాంసుందర్‌ రెడ్డి, లైబ్రేరియన్లు ఎంవీ రంగారావు, డి.లలితాదేవి, కె.విజయ భాస్కర్‌, పి.సృజన పాల్గొన్నారు.

పంట మార్పిడితోరైతులకు మేలు

తిరుమలగిరి : పంట మార్పిడితో రైతులకు మేలు కలుగుతుందని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్‌ సతీష్‌ చౌహాన్‌, కేవీకే శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ సూచించారు. మంగళవారం తొండ గ్రామంలోని రైతు వేదికలో వికసిత కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమంలో వారు మాట్లాడారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతులు శాసీ్త్రయంగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ప్రణీత, వెంకట్‌రెడ్డి, అవినాష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు1
1/2

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు2
2/2

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement