ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 7:44 AM

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రతి రెవెన్యూ గ్రామం, గ్రామపంచాయతీలే కాకుండా ఆవాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించినట్లు కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. నేషనల్‌ జల జీవన్‌ మిషన్‌ అమలుపై మంగళవారం ఢిల్లీ నుంచి డ్రింకింగ్‌ వాటర్‌ – శానిటేషన్‌ సెక్రటరీ అశోక్‌ కే.మీనా తెలంగాణలోని 16 జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీటిని సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరిశీలిస్తున్నామని, జిల్లాలో తొమ్మిది వాటర్‌ ట్రీట్‌ప్లాంట్స్‌ ఉన్నాయని, క్షేత్రస్థాయిలో తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో టెస్టింగ్‌ కిట్స్‌ ఉన్నాయని చెప్పారు. డీడబ్ల్యూఎస్‌ఎం (డ్రింకింగ్‌ వాటర్‌ శానిటేషన్‌ మిషన్‌)పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పీఎం గతి శక్తి ద్వారా 5,404 కిలోమీటర్లు పైప్‌లైన్‌ మంజూరైందని, ఇప్పటికే 2,538 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు చెప్పారు. 552 మంది నల్‌ జల్‌ మిత్ర (గ్రామ మంచినీటి సహాయకులు)లను ఇప్పటికే నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులు నాగేశ్వరరావు, అరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement