ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం

Jun 10 2025 3:14 AM | Updated on Jun 10 2025 3:14 AM

ప్రభు

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం

భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా ప్రభుత్వం కాపాడి భవిష్యత్‌ తరాలకు అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆవరణలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించి మాట్లాడారు. పాత బస్సులను, డీజిల్‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీంతో వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్‌ బస్సులు మంజూరయ్యాయని, వాటిలో మొదటి విడతలో 45 బస్సులను ఒకేసారి ప్రారంభించడం సంతోషదాయకంగా ఉందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లేందుకు అవకాశముందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీని ఆధునీకరించి భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం, ప్రజా రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం, ఆర్టీసీ పరిరక్షణ నినాదాలతో..

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ చుట్టుముట్టూ సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ అంటూ సూర్యాపేటకు ఉన్న ఖ్యాతిని గుర్తించి 79 బస్సులను కేటాయించామన్నారు. రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం, ఆర్టీసీ పరిరక్షణ అనే మూడు నినాదాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూర్యాపేట డిపో నుంచి హైదరాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, కోదాడ ప్రాంతాలకు ఈ ఎలక్ట్రికల్‌ బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ లో ఎలక్ట్రికల్‌ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో నల్లగొండలో కూడా ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి బస్సులు మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అమ్మగారి ఇంటికి, పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను ప్రతి నెలా రూ.300 నుంచి రూ.350 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా కార్మికుల సంక్షేమం, భవిష్య నిధి, నూతన బస్సులు, కారుణ్య నియామకాలకు వినియోగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామేల్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ మెంబర్‌ చెవిటి వెంకన్న యాదవ్‌, సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వేణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉపేష ఖాన్‌, వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్‌, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం

ఫ సూర్యాపేట డిపోలో ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఫ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌

బస్సులో ప్రయాణం

ఎలక్ట్రిక్‌ బస్సులను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామేల్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొప్పుల వేనారెడ్డి, ఏఐసీసీ మెంబర్‌ సర్వోత్తమ్‌ రెడ్డి లతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులో కండక్టర్‌ ను జీరో టికెట్‌ జారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్‌ రెడ్డి నివాసం వరకు వెళ్లారు. ఆయన నివాసంలో భోజన విరామం అనంతరం ఖమ్మం కు బయలుదేరివెళ్లారు.

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం1
1/2

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం2
2/2

ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement