
పఠనాశక్తి పెంచేలా..
ఒక్కో పాఠశాలకు
రూ.10వేల చొప్పున..
జిల్లాలో మొదటి విడతలో 22, రెండో విడతలో 9 మొత్తం 31 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపికయ్యాయి. ఈ పీఎంశ్రీ పాఠశాలలకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి ఒక్కో పాఠశాలకు రూ.10,000 చొప్పున మొత్తం జిల్లాకు 3,10,000 నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల దినపత్రికలు, మాసపత్రికలు కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాలకు మూడు దినపత్రికలు, మూడు చిన్నపిల్లల పత్రికలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. రోజూ విద్యార్థులు ఈపత్రికలు చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఏడాదిలో పది నెలల పాటు పత్రికల కొనుగోలుకు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.
నాగారం : ప్రభుత్వ బడుల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. గతంలో తొలిమెట్టు, ఉన్నతి తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు క్షుణ్నంగా నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించి అమలు చేశాయి. దీంతో పాటు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలల విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందించేందుకు విజ్ఞాన, విహార యాత్రలు, వార్షికోత్సవాలు నిర్వహణకు ఏటా నిధులు విడుదల చేస్తోంది. తాజాగా విద్యార్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించేందుకు, పాఠశాల స్థాయి నుంచే పఠనాసక్తి పెంపొందించేందుకు పీఎంశ్రీ పాఠశాలలకు వార్త పత్రికలు, మ్యాగజైన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025–26 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి తెలుగు, హిందీ,ఉర్దూ, ఆంగ్లం భాషలకు సంబంధించిన మూడు చొప్పున దిన, బాలల వార,మాస పత్రికలు కొనుగోలు చేయాలని ఆదేశించింది.
ఎల్ఐపీలో భాగంగా..
కొవిడ్ మహమ్మారి తర్వాత పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డిజిటల్ వ్యామోహంతో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గింది. దీన్ని పూరించేందుకు ఎల్ఐపీ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం)ని ప్రస్తుతం పాఠశాలల్లో అమలుచేస్తున్నారు. ఇందుకోసం లెర్నింగ్ కార్నర్ నిధులు ఉపయోగపడతాయి. వార్తా పత్రికలు, వ్యాసాలు, పిల్లల మాస పత్రికలు చదవటం, వాటిపై చర్చలు జరపటం వల్ల విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన పెరుగుతుంది. చక్కటి ఉచ్ఛారణతో మాట్లాడగలుగుతారు. ఉన్నత స్థాయి పరీక్షల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే పుస్తకాల పఠనమే కీలకం. విద్యార్థులకు సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు భాషపై పట్టు రావాలంటే వివిధ భాషలకు చెందిన దిన, వార, మాస పత్రికల పఠనం ఎంతో తోడ్పడుతుంది
ప్రయోజనాలివీ..
ప్రస్తుతం పాఠశాలలు, గ్రంథాలయాల్లో కథలు, ఇతర పుస్తకాలు ఉన్నప్పటికి వార్తపత్రికలు, వార పత్రికలకు ప్రత్యేక బడ్జెట్ లేదు. దిన, వార పత్రికలు చదవడం వల్ల సమకాలీన అంశాలు, వివిధ రంగాల్లో రాష్ట్ర, దేశ పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. అన్ని భాషలపై పట్టు పెరుగుతుంది. రోజుకో ప్రత్యేక పీరియడ్ కేటాయించి పత్రికలు చదివించడం వల్ల తప్పులు లేకుండా చదవడం, రాయడం వస్తుంది. మాతృభాషపై పట్టు పెరిగితే మిగతా భాషలను తేలికగా నేర్చుకోవచ్చు.
ఫ పీఎంశ్రీకి ఎంపికై న 31 బడుల్లో పత్రికల కొనుగోలుకు ప్రత్యేక నిధులు
ఫ ఏడాదికి ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున..
ఫ జిల్లాకు మొత్తం రూ.3.10 లక్షలు మంజూరు
ఫ పిల్లల్లో విజ్ఞానం పెంపొందించేలా ప్రణాళిక
సమకాలీన అంశాలపై అవగాహన
పత్రిక చదవడం వల్ల విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలు పెంపొందుతాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వార్త పత్రికలు చదవడం అలవాటుగా మారితే సమకాలీన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. భాషపై పట్టు పెరగడంతో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
–కె.శ్రావణ్కుమార్, జిల్లా ప్లానింగ్ కోఆర్టినేటర్
ప్రతినెలా నిధుల కేటాయింపు
వివరాలు (రూ.లలో)
తెలుగు దినపత్రిక పత్రికలకు 250
హిందీ/ఉర్దూ 250
ఆంగ్ల దినపత్రిక 200
తెలుగులో పిల్లల పత్రిక 100
హిందీ/ఉర్దూలో పిల్లల పత్రిక 100
ఆంగ్లభాషలో పిల్లల పత్రిక 100

పఠనాశక్తి పెంచేలా..