పంట నష్టపరిహారం విడుదల | - | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం విడుదల

Jun 7 2025 1:18 AM | Updated on Jun 7 2025 1:18 AM

పంట న

పంట నష్టపరిహారం విడుదల

నాగారం : మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు, వడగళ్లకు జిల్లాలోని పలు మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం విడుదల చేసింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 662 మంది రైతులకు రూ.110.41 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,104.07 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగినట్లుగా ఇందులో ముఖ్యంగా వరిపంట భారీగా దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.

రైతన్నకు ఊరట!

బోరు బావుల్లో నీరుండడంతో వరిపంట సాగుకు రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. అయితే అకాల వర్షాలు అన్నదాతలకు కడగళ్లు మిగిల్చాయి. మామిడి కాయలు సైతం నేల రాలాయి. ఎట్టకేలకు పరిహారం విడుదలైన పంట నష్టపరిహారంతో రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. పంట ఎంత నష్టపోయినా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఫ ఎకరాకు రూ.10 వేల చొప్పున

రూ. 110.41 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం

ఫ త్వరలోనే రైతులకు

అందనున్న పరిహారం

పంట నష్టం ఎకరాల్లో.. 1,104.07

నష్టపోయిన రైతులు 662

విడుదలైన పరిహారం రూ.110.41 కోట్లు

త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ

ప్రభుత్వం జిల్లాకు రూ.110.41 కోట్ల పంట నష్టపరిహారం విడుదల చేసింది. ఈ పరిహారం డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

– జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట

పంట నష్టపరిహారం విడుదల 1
1/1

పంట నష్టపరిహారం విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement