బోనస్‌ డబ్బుల కోసం కక్కుర్తి! | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ డబ్బుల కోసం కక్కుర్తి!

Apr 28 2025 7:10 AM | Updated on Apr 28 2025 7:10 AM

బోనస్‌ డబ్బుల కోసం కక్కుర్తి!

బోనస్‌ డబ్బుల కోసం కక్కుర్తి!

చిలుకూరు: సన్నధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ డబ్బుల కోసం కక్కుర్తిపడి అక్రమాలకు తెర తీశారు కొందరు. ఈ వ్యవహారం ఆదివారం చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2,300తోపాటు బోనస్‌గా రూ.500 కలిపి రూ.2,800 చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకే బోనస్‌ వస్తుంది. కానీ, నారాయణపురం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ఓ వ్యాపారి వద్ద ధాన్యం కొంటూ నిబంధనలు విరుద్ధంగా వ్యవహిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా..

నారాయణపురం గ్రామానికి చెందిన ఒక వ్యాపారి స్థానిక పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను మచ్చిక చేసుకున్నాడు. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు లారీల్లో 600కుపైగా ధాన్యం బస్తాలను (70 కేజీల బస్తాలు) తీసుకొచ్చి కేంద్రంలో రాశులుగా పోశాడు. ఆ ధాన్యాన్ని కేంద్రం నిర్వాహకులు కాంటా వేశారు. వారం రోజుల క్రితం కూడా ఇదే వ్యాపారికి చెందిన మరో లారీ ధాన్నాన్ని కాంటా వేయించినట్లుగా తెలిసింది. ఈ విషయం గ్రామ రైతులు, సంఘం చైర్మన్‌కు తెలియడంతో నిబంధనలకు విరుద్ధంగా ఎలా కాంటా వేస్తారని కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. అయితే సదరు వ్యాపారి రైతుల నుంచి తక్కువ రేటుకు కొని మద్దతు ధరతోపాటు బోసస్‌ వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఈ కేంద్రంలో అమ్మినట్టు తెలుస్తోంది. అయితే బినామీ రైతుల పాస్‌ పుస్తకాలు చూపించి అమ్మడం, కేంద్రం నిర్వాహకులు ఆ వ్యాపారి ఇచ్చే కమీషన్‌కు ఆశపడి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా మండల పరిధిలోని కొండాపురం ఐకేపీ కేంద్రంలో ఇత ర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయడంతో అధికా రులు స్పందించి దిగుమతి కోసం మిల్లుకు వెళ్లిన సదరు లారీని వెనక్కి రప్పించారు. ఈ ఘటనపై విచారణ చేసి ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. అయినా అధికారుల తనిఖీలు లేక మళ్లీ నారాయణపురంలో ఇలాంటి వ్యవహారమే కొనసాగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీలు చేయాలని, సదరు కొనుగోలు కేంద్రంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.

ఫ బినామీ రైతుల పేరుతో ధాన్యం

అమ్ముతున్న వ్యాపారి

ఫ నారాయణపురం కొనుగోలు

కేంద్రంలో అక్రమాలు

ఫ కమీషన్‌కు ఆశపడి సహకరిస్తున్న

సెంటర్‌ నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement