
అర్హులకు రుణసాయం అందించాలి
భానుపురి(సూర్యాపేట): రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులందరికీ రుణసాయం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 60,502 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీటీడీఓ శంకర్, డీఎండబ్ల్యూఓ జగదీశ్వర్రెడ్డి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఆర్.దినేష్ కుమార్, ఐఓబీ మేనేజర్ వి.నాగబాబు, యాక్సిస్ బ్యాంకు మేనేజర్ రవి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎం.సురేష్, కెనరా బ్యాంకు మేనేజర్ ఎస్.కళ్యాణ్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్, బ్యాంకు ఆఫ్ మలేషియా మేనేజర్ తిరుపతమ్మ, అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సన్న బియ్యం సరఫరా, యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహాన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్కు జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్ఓ రాజేశ్వరరావు, జిల్లా అధికారులు హాజరయ్యారు.