
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొండ గ్రామ వాసి
తిరుమలగిరి : హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నెమురుగొమ్ముల గౌతమ్రావు పేరును శుక్రవారం ఖరారు చేశారు. ప్రస్తుతం గౌతమ్రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్గా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనున్నది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్రావును నిర్ణయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్య లక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు.