గడ్డి వాములు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డి వాములు దగ్ధం

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

గడ్డి వాములు దగ్ధం ఎస్పీ గ్రీవెన్సుకు 72 వినతులు

నరసన్నపేట: మండలంలోని జమ్ము పంచా యతీ దశుమంతపురంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు సోమవారం దగ్ధమయ్యాయి. జుత్తు వెంకటరమణకు చెందిన 6 ఎకరాల గడ్డి నిల్వ చేయగా మంటలు అంటుకున్నాయి. గ్రామస్తు లు స్పందించేసరికే మంటలు అధికమయ్యా యి. రూ.20 వేల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సులో బాధిత ప్రజల నుంచి 72 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని భరోసా అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement