మత్తుతో జీవితం చిత్తు | - | Sakshi
Sakshi News home page

మత్తుతో జీవితం చిత్తు

Dec 21 2025 12:54 PM | Updated on Dec 21 2025 12:54 PM

మత్తుతో జీవితం చిత్తు

మత్తుతో జీవితం చిత్తు

మత్తుతో జీవితం చిత్తు టెక్కలి: యువత డ్రగ్స్‌ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్‌ యాత్ర శనివారం కోటబొమ్మాళి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ కే.వీ.మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్‌ వద్దు బ్రో పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్‌, ఎల్‌.ఎల్‌.నాయుడు, టి.రామకృష్ణ పాల్గొన్నారు. అభ్యుదయ యాత్ర పొడిగింపు 22న నెట్‌బాల్‌ ఎంపికలు

శ్రీకాకుళం క్రైమ్‌ : పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభ్యుదయ సైకిల్‌ యాత్ర వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్‌ జెట్టి, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29తో ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరగాల్సివుండగా, జనాదారణ పెరగడంతో యాత్ర పొడిగించామని, వచ్చే నెల 3న ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరుగుతుందని వెల్లడించారు.

టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement