
సమ్మెకు సన్నద్ధం
తీవ్ర పనిభారం, ఒత్తిళ్లతో పాటు ఇంటింటికీ వెళ్లి విధులు నిర్వర్తించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ప్రతినిధులంతా ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాన్ని అందించారు. ఈ మేరకు 15 రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెల 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నేతలను కూడా కలిసి వారి సలహాసూచనల ప్రకారం ముందుకు వెళ్తాం.
– కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్