
డబ్బు కాజేశారు
నా కుటుంబంలో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారి చదువులు, వివాహం కోసం 2017 సంవత్సరంలో రూ.11 లక్షలు డిపాజిట్ చేశాను. ఇప్పుడు మా ఖాతాలను, బాండ్లను తనిఖీ చేయిస్తే డూప్లికేట్గా గుర్తించారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– చాట్ల లోహిదాస్, ఇచ్ఛాపురం
సొమ్ము ఇప్పించాలి
ఇండియన్ ఆర్మీలో సేవ చేసి రిటైరైన తర్వాత వచ్చిన సొమ్ముని పోస్టాఫీస్లో భద్రంగా ఉంటుందని దాచుకొంటే దాన్ని కాజేశారు. పోస్టాఫీస్లోనే భద్రత కరువైతే మరెక్కడ దాచుకోవాలి. నష్టపోయిన ఖాతా దారులందరికీ న్యాయం చేయాలి.
– ఉప్పాడ జ్యోతిసాయికుమార్, మాజీసైనికుడు
వడ్డీతో సహా డబ్బు వస్తుంది
ఖాతాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్కామ్కి పాల్పడిన వారి లో ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు ఈ కేసుని సీబీఐకి ఆప్పగించడం జరిగింది. పోస్టాఫీస్లో డిపాజిట్ చేసిన ప్రతి ఖాతాదారునికి నియమ నిబంధనలను అనుసరించి వడ్డీతో ప్రతీ పైసా చేరుతుంది. – వి.హరిబాబు,
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్, శ్రీకాకుళం

డబ్బు కాజేశారు

డబ్బు కాజేశారు