అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు

Sep 3 2025 4:27 AM | Updated on Sep 3 2025 4:27 AM

అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు

నరసన్నపేట: అనారోగ్యంతో మృతి చెందిన పోలాకి ఏఎస్‌ఐ పి.ఆదినారాయణకు మంగళవారం నరసన్నపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలాకి ఎస్‌ఐ రంజిత్‌ తెలిపారు. నరసన్నపేట, పోలాకి పోలీసుస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం తిలారు–కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు పైబడి ఉంటుందని, చేతిపై శ్రీను అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు నుంచి జారి పడి మృతిచెందాడా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సోమేశ్వరరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement