
కూటమి మోసాలు ప్రజలకు చెబుదాం
● నేడు వెన్నుపోటు దినం విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని బుధవారం శాంతియుతంగా నిర్వహించి, ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని వైఎస్సార్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధంగా ఉండాలని ఆయన కోరారు. గత ఏడాదిగా ప్రజలకు జరిగిన మోసాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బుధవారం ర్యాలీలు నిర్వహించి, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రా లు అందజేయనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అడ్డంకులు కల్పించే య త్నం జరిగినా, వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని, అవసరమైతే మీడియా ఎదుట వివరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్ర భుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టంగా బ యటపడేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజల మనోవేదనను ప్రభుత్వానికి తెలియజేసే శాంతియుత ఉద్యమమని వివరించారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు