ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

May 26 2025 12:21 AM | Updated on May 26 2025 12:21 AM

ఆదిత్

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

శ్రీకాకుళం అర్బన్‌: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి కొనసాగుతోంది. మూడో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు, మొక్కుల్లో భాగంగా తలనీలాలు, వైశాఖ మాస ప్రత్యేక సంప్రదాయ పూజల్లో భాగంగా గ్రామీణ మహిళల ప్రసాదాల నివేదన తదితర ప్రత్యేక పూజలు విశిష్టతతో అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భారీగా భక్తులు తరలిరావడంతో ఈ సౌకర్యాలు పెద్దగా సరిపడలేదనే విమర్శలు వినిపించాయి. భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి పరిసరాలలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో ప్రత్యేక అలంకరణతో స్వామివారిని సర్వదర్శనాలకు అనుమతించారు.

ఒక్కరోజులోనే రూ.12,29,751 ఆదాయం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఒక్క రోజు ఆదాయం రూ.12,29,751 లభించింది. టికెట్ల రూపంలో రూ.8,84,100, పూజలు, విరాళాల రూపంలో రూ.81,496, ప్రసాదాల రూపంలో రూ.2,64,155 కలిపి మొత్తంగా రూ.12,29,751 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం 1
1/1

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement