
రైలు ఢీకొని వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కాకితోట వద్ద శనివారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళుతున్న రైలు ఢీకొని పాతపట్నం మేజర్ పంచాయతీ శివశంకర్ ఒకటో వీధికి చెందిన బోయిన కామేశ్వరరావు(57) మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఈయన పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు కూడలిలో పకోడి బండి నడుపుతూ జీవనం సాగించేవాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమర్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. కామేశ్వరరావుకు భార్య బోయిన రవణమ్మ, కుమారుడు సంతోష్కుమార్ ఉన్నారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి గ్రామంలో కొయ్యి తాతారావు (66) అనే వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన విశాఖపట్నంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. ఈ నెల 1న పెన్షన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చాడు. మద్యానికి బానిస కావడం, అనారోగ్య సమస్యలు ఉండటంతో మన స్థాపం చెంది పక్కనే గల తోటలోకి వెళ్లి లుంగీతో ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. తాతారావుకు భార్య పార్వతి, కుమార్తె ఉన్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి