మళ్లీ బీచ్‌ ఫెస్టివల్‌ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ బీచ్‌ ఫెస్టివల్‌

May 3 2025 8:29 AM | Updated on May 3 2025 8:29 AM

మళ్లీ బీచ్‌ ఫెస్టివల్‌

మళ్లీ బీచ్‌ ఫెస్టివల్‌

సోంపేట: బారువ తీరం మరోసారి బీచ్‌ ఫెస్టివల్‌కు సిద్ధమైంది. గత నెల 18, 19 తేదీల్లో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పర్యాటకులకు వసతుల కల్పనలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెలలో మరో రెండు రోజులు బీచ్‌ ఫెిస్టివల్‌ నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే బారువ తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులు సేద తీరేందుకు టెంట్లు వేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాగునీటి సరఫరా కూడా ఏర్పా టు చేయలేదని గుర్తు చేశారు.

ట్రాఫిక్‌, విద్యుత్‌ కష్టాలు

ఏప్రిల్‌లో బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులను ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా వేధించింది. బారువ ప్రధాన రహదారి వద్దకు చేరుకోవడానికి గంటల సమయం పట్టింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాల్సి ఉంది. సాయంత్రం అయితే బారువ తీర ప్రాంతం నుంచి బారువ కొత్తూరు గ్రామం వరకు విద్యుత్‌ వీధి దీపాలు లేకపోవడంతో పర్యాటకులు చీకటిలో ఇబ్బందులు పడ్డారు.

ఏర్పాట్ల పరిశీలన..

బీచ్‌ ఫెస్టివల్‌పై స్థానిక అధికారులకు కలెక్టర్‌ సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం బారువ తీరంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు, బోట్‌ రైడింగ్‌, బైక్‌ రైడింగ్‌, కిడ్స్‌ ప్లేజోన్‌, వాటర్‌ సర్ఫింగ్‌, ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

బారువ తీరంలో నేటి నుంచి

ప్రారంభం

సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విన్నపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement