ఆత్మగౌరవం | - | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం

Mar 21 2025 12:51 AM | Updated on Mar 21 2025 12:50 AM

● మాతృ భాషను మృతభాషగా మార్చొద్దు ● జూనియర్‌ కాలేజీల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలి ● ఇంటర్‌ స్పాట్‌ కేంద్రం వద్ద అధ్యాపకుల నిరసన

శ్రీకాకుళం స్పాట్‌ కేంద్రం వద్ద నిరసన చేపడుతున్న జూనియర్‌ కళాశాలల తెలుగు అధ్యాపకులు

శ్రీకాకుళం న్యూకాలనీ:

దేశభాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు.. కీర్తించారని, కానీ తెలుగుభాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం మాతృభాషను స్వయంగా ప్రభుత్వమే మృతభాషగా మార్చుతుండటం బాధాకరమని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియెట్‌ విద్యలో తెలుగు సబ్జెక్టునే లేకుండా నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటాన్ని తెలుగు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. సంస్కరణల పేరిట తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని జూనియర్‌ కళాశాలల తెలుగు అధ్యాపకు ల సమాఖ్య ప్రతినిధులు డాక్టర్‌ పేడాడ రాజేశ్వరరా వు, హనుమంతు సుధాకర్‌, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, డి.గిరిబాబు, బి.రామలక్ష్మి, తదితరులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సంఘం పిలుపు మేర కు ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వం తీరును, ఇంటర్‌ విద్య ఉన్నతాధికారుల దుందుడుకు చర్యలకు ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంటర్‌ విద్యలో తప్పనిసరి గా ద్వితీయభాషగా ఉన్న తెలుగును.. సంస్కరణల పేరిట ఐచ్ఛిక (ఆప్షనల్‌)సబ్జెక్టుగా చేయడం ద్వారా భవిష్యత్తులో తెలుగుభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి మాతృభాషను వేరుచేయడమంటే.. తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని మండిపడ్డారు.

ఆర్‌ఐఓకు వినతిపత్రం అందజేత..

అనంతరం స్పాట్‌ కేంద్రం నుంచి జిల్లా ఆర్‌ఐఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి, ఇంటర్‌ విద్య ఉన్నతాధికారులకు తమ గోడును తెలియజేయడమే కాకుండా తెలుగు భాష ఉనికిని, తెలుగు సబ్జెక్టు మనుగడను, తెలుగు అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులతోపాటు అన్నెపు లక్ష్మణరావు, ఎన్‌.సంతోష్‌కుమార్‌, కె.లక్ష్మి, పైడి హేమలత, తారకేశ్వరరావు, వెంకటరమణ, కె.అసిరినాయుడు, ఎం.రమేష్‌, పైలా శశిధర్‌, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నాడు గొప్పన్నారు..?

ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ పాఠశాల విద్యలో భాగమే నని.. అలాంటి పాఠశాల విద్యలో గత ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొ స్తే.. పూర్తిగా వ్యతిరేకించి తెలుగు మీడియం కో సం పట్టుబట్టిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సబ్జెక్టే ఉండకూడదని భావించడం ఎంతమాత్రం తగదు.

– హనుమంతు సుధాకర్‌, తెలుగు అధ్యాపకుడు

తెలుగు

ఆప్షనల్‌ కాదు..

ఆత్మగౌరవం 1
1/2

ఆత్మగౌరవం

ఆత్మగౌరవం 2
2/2

ఆత్మగౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement