నరసన్నపేట: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సుబలై గ్రామానికి చెందిన తుఫాన్ కరియా అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. తుఫాన్ కరియా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో రితీష్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారంతో మడపాం టోల్గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో తుఫాన్ కరియా ఒక వాహనంలో నుంచి దిగిపారిపోతుండగా వెంబడించి పట్టుకొని కేసు నమోదు చేశారు. బరంపురం నుంచి ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి సూరత్కు 10.31 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం ముమిదిహ గ్రామానికి చెందిన బురగాన సింహాచల పాత్రో, సంజయ బెహరాలను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. వీరిద్దరూ సూరత్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. వారికి అక్కడ గంజాయి వ్యాపారం చేసే గొల్ల అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తనకు గంజాయి అందిస్తే కిలోకు రూ.9 వేలు ఇస్తానని చెప్పడంతో ఒడిశా రాష్ట్రంలోని కొద్ద గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. గంజాయిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. సమావేశంలో సీఐ చిన్నమనాయుడు, ఎస్ఐ ముకుందరావు పాల్గొన్నారు.
భారీగా గంజాయి స్వాధీనం