
పైడి హరనాథరావును సత్కరిస్తున్న దృశ్యం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరంలో మహతి సంస్థ రజతోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ సేవలను గుర్తు చేశారు. అనంతరం ప్రముఖ అష్టావధాని పైడి హరనాథరావును సత్కరించారు. ఆ తర్వాత ‘ప్రవరుని వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై హరనాథరావు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, పీవీఎస్ఎస్ ప్రసాద్, సనపల నారాయణమూర్తి, నిష్టల నర్సింహమూర్తి, వి.కామేశ్వరరావు, పిలకా శాంతమ్మ, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.