
అలుదు చెరువులో గంబూషియా చేపలు విడుదల చేస్తున్న దృశ్యం
టెక్కలి: జిల్లా స్థాయి రగ్బీ క్రీడాకారుల ఎంపికలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, కోశాధికారి డి.రామకృష్ణ, నిర్వాహక కార్యదర్శి బి.నారాయణరావు తదితరులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–18 విభాగంలో బాల బాలికలకు నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా 2005–2007 మధ్యలో జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆధా ర్ కార్డు, జనణ ధ్రువీకరణ పత్రంతో ఎంపికలకు హాజరు కావాలని వెల్లడించారు. ఈ జట్టులో ఎంపికైన వారు అక్టోబర్ నెలలో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8500007272 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు.
బంతి మొక్కల వితరణ
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీవీ విద్యాసాగర్ రైతులకు శుక్రవారం బంతి మొక్కలు వితరణగా అందజేశారు. కేవీకే, జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూ లన సంస్థ ఆధ్వర్యంలో ఈ మొక్కలను వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, శ్రీకాకుళం ఎల్హెచ్డీపీ ఎంబీ నారాయణరావు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏపీఎం ఈశ్వరరావు, కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.హరికుమార్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలవేణి పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశం పొందగోరు అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరవచ్చన్నా రు. వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసినవారితోపాటు గృహిణులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఆయాలు, ఆశ వర్కర్లు, ఇలా ఎవరైనా ఓపెన్ స్కూల్ ద్వారా చేరవచ్చని డీఈఓ తెలిపారు. టెన్త్లో ప్రవేశాలు పొందే విద్యా ర్థులకు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు పూర్తయ్యి ఉంటే సరిపోతుందన్నారు. ఇంటర్లో చేరే వ్యక్తులు టెన్త్ ఉత్తీర్ణులైతే సరిపోతుందన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు/అభ్యర్థులు వెంటనే సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో దరఖాస్తు సమర్పించి మీసేవ/ఏపీ ఆన్లైన్ ద్వరా నిర్ణీత ఫీజును చెల్లించాలని సూచించారు.
చెరువుల్లో గంబూషియా చేపల విడుదల
సారవకోట: మలేరియా నిర్మూలనలో భాగంగా దోమల ఉత్పత్తిని నియంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా పలు చెరువుల్లో 8 లక్షల గంబూషియా చేపలను విడుదల చేయనున్నట్లు జిల్లా మలేరియా అధికారి పీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం మండలంలోని అలుదు గ్రామంలోని బందరువాని చెరువు, సారవకోటలోని శివరామపాత్రుని కోనేరు, అర్లి సమీపంలోని రంగసాగరంలో ఈ గంబూషియా చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతలో 12 మండలాల్లో 4 లక్షల గంభూషియా చేపలను విడుదల చేశామని, ప్రస్తుతం రెండు విడతల్లో 4 లక్షల చేపలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చేపలు చెరువుల్లోని దోమల లార్వాలను నాశనం చేస్తాయని తెలిపారు. అలాగే ప్రతి వసతి గృహంలో ఐఆర్ఎస్ స్ప్రేని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 10 మలేరియా కేసులు, 30 డెంగీ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఎంపీడీఓ ఆర్ రాంబాబు, అసిస్టెంట్ మలేరియా అధి కారి ఎస్.శ్రీనివాసరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ వైకే శ్రీనివాస్, స్థానిక వైద్యులు సౌమ్య, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కేవీకేలో బంతి మొక్కలు అందిస్తున్న దృశ్యం