
కమిషనర్కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణస్వామి ని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు శేరి సుభాష్రెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేదాశీర్వచనం ఇప్పించి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కృష్ణమాచార్యులు, నేతేటి హరిప్రసాద్శర్మ తదితరులు పాల్గొన్నారు.
‘మత్స్యకారులను
ఆదుకోవాలని వినతి’
ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మత్స్యకారులను ఆదుకోవాలని జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ కోనాడ నర్సింగరావు, జిల్లా ఫిష్ ఆంధ్ర వైస్ ప్రెసిడెంట్ బడి అప్పన్న, బడివానిపేట సర్పంచ్ కారి తాతారావులు కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈనెల 9న రోడ్డు ప్రమాదం జరిగిందని, ఎనిమిది మందికి గాయాలు కాగా.. వీరిలో కారి నర్సమ్మ చికిత్స పొందుతూ మృతి చెందిందని, చీకటి తవిటమ్మ, ముగతమ్మ, లక్ష్మణరావులు శాశ్వత వికలాంగులుగా మిగిలారని తెలిపారు. మిగిలినవారంతా తీవ్ర గాయాలతో చికిత్సలు పొందుతున్నారని, మత్స్య శాఖ జీఓకు అనుగుణంగా ఈ పేద కుటుంబాలను ఆదుకోవాలని కమిషనర్ను కోరారు.
మొక్కల పెంపకంపై
ప్రత్యేక దృష్టి
పాతపట్నం: ఎస్సీ, ఎస్టీ కుటుంబ సభ్యులు 100 రోజుల పని దినాల్లో భాగంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ జీవీ చిట్టిరాజు అన్నారు. మండలంలోని సింగుపురం, సీతా రాంపల్లి, పెద్దలోగిడి, తెంబూరు గ్రామాల్లోని మొక్కల పెంపకం పనులను ఆయన శుక్రవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగా క్లస్టర్ సిబ్బందితో ఉపాధి హామీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఏపీడీ పంచాది రాధ, ఏపీఓ సురేష్, జేఈ రవి, సాంకేతిక సహాయకులు, క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొనే విద్యార్థినుల ఎంపిక
ఎచ్చెర్ల క్యాంపస్: ఢిల్లీలో 2024లో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ఎన్ఎస్ఎస్ విద్యార్థినుల ఎంపిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మైదానంలో శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర జాతీయ సేవాపథకం యువజన విభాగం అధికారి ఆర్.సైదా, జిల్లా జాతీయ సేవాపథకం సమన్వయకర్త డాక్టర్ ఎం.అనురాధ పర్యవేక్షించారు. 91 మంది హాజరు కాగా, వీరిలో ప్రతిభ ఆధారంగా ముగ్గురిని త్వరలో ప్రకటించనున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంకు
సీసీ కెమెరా ధ్వంసం
సారవకోట: మండలంలోని చీడిపూడి యూనియన్ బ్యాంకు సీసీ కెమెరాను గురువారం రాత్రి ఆకతాయి ధ్వంసం చేశాడు. గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం సమయంలో ఆ గ్రామానికి చెందిన యువకుడు కెమెరాను ధ్వంసం చేసినట్లు సిబ్బంది శుక్రవారం గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ వెంకటరమణ స్థానిక పోలీస్స్టేషన్కు, ఉన్నతాధికారులకు సమాచా రం ఇవ్వడంతో పాటు ఆ యువకుడిని గుర్తించి సీసీ కెమెరా మరమ్మతులకు అయ్యే ఖర్చును వసూలు చేసినట్లు మేనేజర్ తెలిపారు.

తెంబూరు ఆసర్ల చెరువు గట్టుపై ఉన్న మొక్కలను పరిశీలిస్తున్న పీడీ చిట్టిరాజు

ఎమ్మెల్సీ సుభాష్రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న శంకరశర్మ