
మొక్కజొన్న చేనును పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, రైతులు
ఆమదాలవలస: మొక్కజొన్న పంటలో సమగ్ర తెగుళ్ల యాజమాన్యంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞానకేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.నీలవేణి తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పదివేల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న సాగవుతోందని తెలిపారు. రైతులు పంటపై అవగాహన లేక నష్టపోతున్నారని, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే పంటలో అధిక దిగుబడులు సాధ్యమవుతాయని ఆమె సూచించా రు. తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంట వేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగు చేసి నేలలో కలియ దు న్నాలని తెలిపారు. ట్రైకోడెర్మా శిలీంద్రాన్ని పశువుల ఎరు వులు వృద్ధి చేసి మూడు నుంచి నాలుగేళ్లు వరుసగా నేలలో కలుపుతూ పోవాలని, ఎకరాకు అదనంగా 30 కిలోలు పొటాషియం ఇచ్చి ఎరువులను వేయాలని, ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలని చెప్పారు. పంట వేసిన త ర్వాత ముఖ్యంగా పూత దశ నుంచి నేలలో తేమ తగ్గకుండా ఉండేలా నీటి తడులు పెట్టాలని, పంట కోసం తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలన్నా రు. పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని తెలిపారు. ఆమె వివరిచిన తెగుళ్లు, నివారణ చర్యలు ఇలా ఉన్నాయి.
టర్సికం ఎండు తెగులు: ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకు పచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు, నాలుగు సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట మొక్క కింది ఆకులపై కనిపించి పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమ తో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి. శిలీంద్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా కనిపిస్తాయి. ఈ మచ్చల కండేపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి.
నివారణ మార్గాలు: దీని నివారణకు మ్యాంగోజబ్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటీ లేక రెండు సార్లు పిచికారీ చేసి సమర్థంగా అరికట్టవచ్చు. విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాన్కోజబ్ శిలీంద్ర నాసినితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
త్రుప్ప తెగులు: ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కులు మాదిరిగా తెగులు లక్షణా లు కనిపిస్తాయి. పంట పెరిగిన కొద్దీ ఆకుల పైన పొక్కులు గోధుమ వర్ణం నుంచి నలుపు వర్ణానికి మారుతాయి. పూత సమయంలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అధిక తేమగల చల్లని వాతావరణంలో తెగులు ఉద్ధృతి, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
దీని నివారణకు మ్యాన్కు జబ్ ఎకరాకు 500 గ్రాములు 200 నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేయాలి.
బొగ్గు కుళ్లు తెగులు: పూత దశ తర్వాత ఆ నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ తెగులు ఎక్కువ తీవ్రతతో సోకుతుంది. నేలలోని శిలీంద్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపిస్తుంది. కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాక ముందే కాండం భా గం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం తెలుపు రంగులోనుంచి నలుపు రంగులోకి మారడం గమనించవచ్చు.
పాము పొడ తెగులు: ఈ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కల కింద ఆకులపై సోకి పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. బూడిద గోధుమ మచ్చలు ఆకులు, కాండంపై ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి చూడటానికి పాము పొడ మాదిరిగా కనిపిస్తాయి.
దీని నివారణ నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఒకటి లేదా రెండు ఆకులు తీసివేయాలి. 200 గ్రాములు కార్బెండిసం లేదా 200 మిల్లీలీటర్ల ప్రాఫిట్ కానిస్టేబుల్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులు పిచికారీ చేయాలి.
మొక్కజొన్నలో తెగుళ్ల యాజమాన్యం
తెగుళ్లు గుర్తించకపోతే అంతా నాశనం
శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే
అధిక దిగుబడులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 10వేల హెక్టార్లలో సాగవుతున్న మొక్కజొన్న

టర్సికం తెగులుతో ఉన్న మొక్కజొన్న చేను