
జమ్ము వద్ద వరి పైరును పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. బుధవారం వేకువజామున బరంపురం వైపు వెళ్లే డౌన్లైన్ ట్రాక్లో పాతాళ సిద్ధేశ్వరాలయం సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడని, గుర్తుపట్టలేని విధంగా శరీరం ఛిద్రమైందని పేర్కొన్నారు. నలుపు ఫ్యాంట్, టీషర్ట్ ధరించి ఉన్నాడని, కుడిచేతికి సిల్వర్ కడియం, ఫ్యాంట్ జేబులో బైక్ కీ ఉన్నట్లు గుర్తించిచామని తెలిపారు. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఫోన్లో వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు
సారవకోట: సంతకవిటి మండలం తమరం గ్రామానికి చెందిన అంబకంటి సురేష్ ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ సారవకోట మండలం చిన్నకిట్టాలపాడుకు చెందిన వివాహిత బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిత్యం ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, లేనిపక్షంలో ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ రమణమూర్తి తెలిపారు.
కుళ్లు తెగులుపై అప్రమత్తం
నరసన్నపేట: వాతావరణంలో మార్పుల కారణంగా వరి పైరును కుళ్లు, పొడ తెగులు, ఆకుముడత వంటి తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి అన్నారు. ఆమదాలవలస రైతు శిక్షణా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఉదయబాబుతో కలిసి బుధవారం నరసన్నపేట మండలం జమ్ము తదితర గ్రామాల పరిధిలోని వరి పైర్లు పరిశీలించారు. పరిశీలనలో నరసన్నపేట వ్యవసాయాధికారి కె.సునీత ఉన్నారు.