వేంకటరమణుడికి సూర్యాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వేంకటరమణుడికి సూర్యాభిషేకం

Oct 14 2025 6:55 AM | Updated on Oct 14 2025 6:55 AM

వేంకటరమణుడికి సూర్యాభిషేకం

వేంకటరమణుడికి సూర్యాభిషేకం

హిందూపురం: పట్టణంలోని పేట వేంకటరమణ స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. ఉదయం అభిషేకం అనంతరం వేంకటరమణ స్వామి మూలవిరాట్‌ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఇలా దిగువ నుంచి మూలవిరాట్‌ పై వరకూ ప్రసరిస్తూ అభిషేకం చేస్తున్నట్లు కనిపించాయి. ఈ అపూర్వఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అర్చకులు మూలవిరాట్‌కు పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నరసింహమూర్తి, దేవస్థానం చైర్మన్‌ భగిరథ నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement