
యోగాతో రుగ్మతలు దూరం
లేపాక్షి: రోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక రుగ్మతలు దూరమవుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒత్తిడిని అధిగమించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. మే 21న పుట్టపర్తి నుంచి యోగాంధ్ర ప్రారంభించామని వెల్లడించారు. ఇటీవల పుట్టపర్తిలో రెండు వేల మందితో, కదిరిలో 3 వేల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇపుడు లేపాక్షిలోనూ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారని తెలిపారు. అనంతరం యోగా గురువులు శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి అభ్యాసకులతో వివిధ ఆసనాలను వేయించారు. కలెక్టర్తో పాటు పలువురు అధికారులు కూడా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ, టూరిజం శాఖ ఇన్చార్జి నరసయ్య, ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ నరసింహమూర్తి, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు, ఆయుష్ డాక్టర్ సాహితీ, ఎంఈఓలు నాగరాజు, కుళ్లాయప్ప, ఐసీడీఎస్, వెలుగు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అదనపు గదులు ప్రారంభించిన కలెక్టర్
స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలోని అదనపు గదులను మంగళవారం ఉదయం కలెక్టర్ టీఎన్ చేతన్ ప్రారంభించారు. అదేవిధంగా విద్యాలయలోని ఎన్సీసీ గదులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
పర్యాటక కేంద్రాల్లో యోగాపై అవగాహన
యోగా దినోత్సవంలో కలెక్టర్ చేతన్

యోగాతో రుగ్మతలు దూరం