నాణ్యత నాస్తి..ధర జాస్తి | - | Sakshi
Sakshi News home page

నాణ్యత నాస్తి..ధర జాస్తి

Jun 12 2025 7:27 AM | Updated on Jun 12 2025 7:27 AM

నాణ్యత నాస్తి..ధర జాస్తి

నాణ్యత నాస్తి..ధర జాస్తి

పుట్టపర్తి అర్బన్‌/ సాక్షి నెట్‌వర్క్‌: కూటమి సర్కార్‌ 40 శాతం రాయితీ అంటూ అట్టహాసంగా పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ తీసుకునేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. నైరుతి ముందస్తుగానే పలకరించగా ఇప్పటికే పలువురు రైతులు మార్కెట్‌లో విత్తనం కొన్నారు. మరికొందరు రైతులు రాయితీపై వచ్చే విత్తనం కోసం ఇప్పటి వరకూ వేచి చూసినా ప్రభుత్వం నాసిరకం విత్తనం పంపిణీ చేయడంతో తీసుకోకుండానే వెనుదిరిగారు.

రెండు రోజుల్లో 1,389 క్వింటాళ్లే పంపిణీ..

జిల్లాకు ప్రభుత్వం 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించగా, ఇప్పటి వరకూ 29 వేల క్వింటాళ్ల విత్తనం మాతమ్రే వచ్చింది. దీంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అయితే విత్తన పంపిణీ మంగళవారం ప్రారంభించగా.. బుధవారం నాటికి కేవలం 1,389 క్వింటాళ్ల విత్తనం మాత్రమే రైతులు తీసుకున్నారు. చాలా మంది ఆర్‌ఎస్‌కేల వద్దకు వచ్చి విత్తనం నాణ్యత చూసి తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు.

నాణ్యత సరిగా లేక...

చాలా ప్రాంతాల్లో విత్తనం నాణ్యత నాసిరకంగా ఉంది. చెత్తచెదారం, బుడ్డలు ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. పైగా 40 శాతం రాయితీతో ప్రభుత్వం ఇస్తున్న ధరకే మార్కెట్‌లో నాణ్యమైన విత్తనం దొరుకుతుండటంతో రైతులంతా ప్రైవేటుగానే విత్తనం కొనుగోలు చేస్తున్నారు.

● ధర్మవరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో బుధవారం సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. విత్తనం నాణ్యత సరిగా లేకపోవడంతో కొనుగోలుకు రైతులు పెద్దగా ఉత్సాహం చూపలేదు.

● అమరాపురం మండలంలో పంపిణీ చేసిన విత్తన వేరుశనగ బస్తాల్లో బుడ్లు, చిరు విత్తనాలు అధికంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మూడు బస్తాల విత్తనకాయను మిషన్‌లో ఆడించగా 6 కేజీల వరకు బుడ్లు, చిరు విత్తనాలు 4 కేజీలు వచ్చినట్లు రైతు శశికుమార్‌ తెలిపారు.

● రొళ్లలో పంపిణీ చేసిన సబ్సిడీ విత్తన కాయలు నాసిరకం ఉన్నట్లు రైతులు గుర్తించారు. విత్తనం మరీ చిన్నగా ఉందని, దాన్ని విత్తితే మొలకెత్తదని రైతులు చెబుతున్నారు. రాయితీ పోను రైతువాటాగా చెల్లించాల్సిన మొత్తం వెచ్చిస్తే మార్కెట్‌లో నాణ్యమైన విత్తన వేరుశనగ తీసుకోవచ్చంటున్నారు.

● పరిగి మండలంలో బుధవారం పంపిణీ చేసిన విత్తన బస్తాల్లో జల్లు బుడ్డలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో పాటూ బస్తాకు రూ.1,700 వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు.

రాయితీ విత్తన వేరుశనగకు

స్పందన కరువు

నాసిరకం విత్తనం తీసుకునేందుకు ముందుకు రాని రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement