
పరామర్శపై పైశాచికం!
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ రూరల్/చెన్నేకొత్తపల్లి/కనగానపల్లి: సామూహిక అత్యాచారానికి గురైన రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లికి చెందిన మైనర్ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శిచేందుకు గురువారం ఉదయం బయలుదేరిన వైఎస్సార్సీపీ నాయకులను ఇటు పోలీసులు... అటు పచ్చ రౌడీలు అడుగడుగునా అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఎమ్మెల్యే పరిటాల సునీత పోలీసులను అడ్డుపెట్టుకొని భయబ్రాంతులకు గురిచేసింది.
అడుగడుగునా ఆటంకాలే..
ఏడుగుర్రాలపల్లిలోని దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం పేరూరు బయలుదేరారు. పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ఎన్ఎస్ గేటు, రామగిరి, నసనకోట, ఎగువపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి, తగరకుంట, వేపకుంట, మద్దెలచెరువువ తదితర ప్రాంతాల్లో మకాం వేసిన పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అంతకుముందు పెనుకొండ వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక పేరూరు వైపు వస్తుండగా పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఎస్ గేటు వద్ద మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను పేరూరు వెళ్లకుండా వెనక్కి పంపించారు. కనగానపల్లి మండలం మద్దెలచెరువు వద్ద మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డిని పోలీసులు అడ్డగించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే.. పేరూరు వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా వెళ్లాలంటే అంగీకరించేది లేదని పోలీసులు వాగ్వివాదనకు దిగారు.
వాస్తవాలు బయటికి వస్తాయనే..
ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అల్లరిమూకలు మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండదండలతో కొన్నాళ్లు తప్పించుకు తిరిగారు. అయితే అసలు విషయం బహిర్గతం కావడంతో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏడుగుర్రాలపల్లికి వెళ్తే.. మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో పోలీసులను అడ్డు పెట్టుకుని పరిటాల సునీత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు.
ఎస్పీ ఘాటు హెచ్చరిక..
వైఎస్సార్సీపీ నాయకులు పేరూరు పర్యటనకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లభించలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పైగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా గ్రామాలకు వెళ్తే.. ఊరుకునేది లేదని ఎస్పీ వి.రత్న తెలిపారు.
టీడీపీ సంబరాలు..
వైఎస్సార్సీపీ నేతల పర్యటన గురించి తెలిసిన వెంటనే గొడవలకు ప్లాన్ చేసిన టీడీపీ నేతలు.. ఉన్నఫలంగా పేరూరులో సంబరాలు చేశారు. తల్లికి వందనం విడుదల సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఎక్కడిడెక్కడి నుంచో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి నానా రభస చేశారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోకపోవడం గమనార్హం.
వైఎస్సార్సీపీ నాయకులపై
అధికార జులుం
అత్యాచార బాలిక కుటుంబాన్ని
పరామర్శించకుండా అడ్డంకులు
పోలీసులను ఉసిగొల్పిన
ఎమ్మెల్యే పరిటాల సునీత
పేరూరుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకున్న వైనం
ప్లాన్ ప్రకారం వాహనాలపై
రాళ్లు రువ్విన పచ్చ రౌడీలు
వాస్తవాలు బయటికొస్తాయన్న
భయంతోనే దాడుల పర్వం
తండ్రి మరణించాడు..తల్లి మతిస్థిమితం సరిగా లేదు..ఏ ఆధారమూ.. ఎవరి అండాలేని దళిత మైనర్ బాలికపై 14 మంది కీచకులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడితే... నేటికీ బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించలేదు. పైగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులనూ అడ్డుకుంది. పోలీసులను ఉసిగొల్పి అడ్డంకులు
సృష్టించింది. రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించి భయానక వాతావరణం సృష్టించి పైశాచిక ఆనందం పొందింది.
పక్కా ప్లాన్తోనే దాడి..
ఎక్కడికక్కడ పోలీసులు ఆటంకాలు సృష్టించినా...వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు పేరూరుకు చేరుకున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడే మకాం వేసిన టీడీపీ అల్లరిమూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లిన వాహనాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు రాళ్లు రువ్వారు. ఘటనలో వైఎస్సార్సీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి.

పరామర్శపై పైశాచికం!

పరామర్శపై పైశాచికం!

పరామర్శపై పైశాచికం!

పరామర్శపై పైశాచికం!

పరామర్శపై పైశాచికం!