పరామర్శకు వెళ్తే భయమెందుకు? | - | Sakshi
Sakshi News home page

పరామర్శకు వెళ్తే భయమెందుకు?

Jun 13 2025 4:59 AM | Updated on Jun 13 2025 4:59 AM

పరామర్శకు వెళ్తే భయమెందుకు?

పరామర్శకు వెళ్తే భయమెందుకు?

ఏడాది నుంచి దళిత మైనర్‌ బాలిక అత్యాచారానికి గురికావడం బాధాకరం. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ హెల్త్‌ బులిటెన్‌ ఇవ్వకపోవడం దారుణం. ఈ కేసులలో నిజా నిజాలు తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. బాధిత కుటుంబానికి ఆ గ్రామంలో ప్రాణహాని ఉంది. జిల్లాలోని మంత్రులు, హోంమంత్రి బాధిత బాలికను కనీసం పరామర్శించకపోవడం అత్యంత శోచనీయం. అనంతపురం సమీపంలో గిరిజన యువతి తన్మయి కూడా హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు ఐదు రోజుల ముందే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోవడంతో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయి. వాస్తవిక పరిస్థితులను తెలుసుకొనేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు చెప్పాలి.

–ఉషశ్రీచరణ్‌,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement