బెంగళూరు – బీదర్‌కు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

బెంగళూరు – బీదర్‌కు ప్రత్యేక రైళ్లు

Jun 14 2025 10:16 AM | Updated on Jun 14 2025 10:16 AM

బెంగళ

బెంగళూరు – బీదర్‌కు ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు–బీదర్‌ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 29 వరకు శుక్ర, ఆదివారాల్లో (5 సర్వీసులు మాత్రమే) రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. 15న బెంగళూరు జంక్షన్‌ నుంచి రాత్రి 9.15 గంటలకు ఎక్స్‌ప్రెస్‌ రైలు (06539) బయలుదేరి బీదర్‌ జంక్షన్‌కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు బీదర్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బెంగళూరుకు మరుసటి తెల్లవారుజూమున 4 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి శని, సొమవారాల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయంరోడ్డు, రాయచూర్‌, కృష్ణ, యద్గారి, వాడి, షాహబాద్‌, కలబురిగి, హమ్నాబాద్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైలులో 2–ఏసీ, 3–ఏసీ, స్లీపర్‌బోగీలతోపాటు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

13 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 13 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా బత్తలపల్లి మండలంలో 16.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పుట్టపర్తి మండలంలో 10.2 మి.మీ, అమడగూరు 6.2, అమరాపురం 5.4, ధర్మవరం 4.2, తలుపుల 2.2, నల్లచెరువు 2, సోమందేపల్లి 2.0, బుక్కపట్నం 1.8, తనకల్లు 1.8, తాడిమర్రి, ముదిగుబ్బ, గాండ్లపెంట మండలాల్లో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన బీ ఫార్మసీ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ (ఆర్‌–23) రెగ్యులర్‌, సప్లిమెంటరీ , (ఆర్‌–19), (ఆర్‌–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ వి. నాగప్రసాద్‌ నాయుడు శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ ఏపీ శివకుమార్‌, అడిషనల్‌ కంట్రోలర్స్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌, డాక్టర్‌ ఎం.అంకారావు పాల్గొన్నారు.

పోక్సో కేసు నమోదు

సోమందేపల్లి: స్థానిక ఓ కాలనీలో నివాసముంటున్న 15 ఏళ్ల వయసున్న బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. నాలుగు నెలలుగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యటు చేపట్టినట్లు వివరించారు.

బెంగళూరు – బీదర్‌కు  ప్రత్యేక రైళ్లు 1
1/2

బెంగళూరు – బీదర్‌కు ప్రత్యేక రైళ్లు

బెంగళూరు – బీదర్‌కు  ప్రత్యేక రైళ్లు 2
2/2

బెంగళూరు – బీదర్‌కు ప్రత్యేక రైళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement