
కమనీయం.. శ్రీవారి కల్యాణం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి కల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. ఏటా జేష్ట్య మాసంలో స్వామివారికి నిత్య కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెలలో శనివారం, పర్వదినాలు తప్ప మిగతా రోజుల్లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా అర్చకులు ఆలయంలోని రంగ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుని కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయ పద్ధతిలో కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా భక్తులతో పాటు కర్ణాటక నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. అనంతరం వారంతా శ్రీవారిని దర్శించుకున్నారు.