
వినతుల వెల్లువ
పరిగి: మండలంలోని ఎన్.ముద్దిరెడ్డిపల్లికి చెందిన బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు అఖిల్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. నాలుగు రోజలు క్రితం మైనర్ బాలికతో పాటు అఖిల్ కనిపించకుండా పోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టి ఆచూకీ గుర్తించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో అఖిల్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, బాలికకు సోమవారంతో మైనారిటీ తీరినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.