
పత్రికా స్వేచ్ఛను హరించడమే
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు శంకర నారాయణ
సాక్షి, పుట్టపర్తి: జర్నలిస్టుల అక్రమ అరెస్టులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కొమ్మినేని జర్నలిస్ట్గా ప్రజాస్వామ్యంలో తన పాత్రను మాత్రమే పొషించారన్నారు.
మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు కూడా జాతీయ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన అంశాలనే చెప్పారన్నారు. వాటిని వక్రీకరించి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నిజం చెప్పేవారి గొంతునొక్కేందుకు పోలీసులను ప్రయోగిస్తోందన్నారు. మరోవైపు కూటమి నేతలు సాక్షి కార్యాలయాలపై దండెత్తడం కూటమి సర్కార్ అరాచక పాలనకు అద్దం పడుతోందన్నారు.