
దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా పోలీసులకు
ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
సాక్షి, నెట్వర్క్: సాక్షి చానల్ డిబేట్లో జరిగిన ఒక సంఘటనను సాకుగా తీసుకుని సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు తన వ్యక్తిగత విషయాన్ని వెల్లడించగా.... దాన్ని సాక్షి చానల్కు ఆపాదించడమే కాక ‘సాక్షి’ కార్యాలయంపైకి దండెత్తడం దారుణమన్నారు.
ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. అలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెనుకొండలో జర్నలిస్టులు టి.మల్లికార్జున, గోవింద్, మురళి, జాకీర్ తదితరులు ఎస్ఐ. వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.
హిందూపురంలో పత్రికా విలేకరుల సంఘం ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సురేష్రెడ్డి, రాజేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రొద్దం పోలీసు స్టేషన్లోనూ నాగరాజు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.