7 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

7 మండలాల్లో వర్షం

Jun 10 2025 7:22 AM | Updated on Jun 10 2025 7:24 AM

7 మండ

7 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 7 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక గుడిబండ మండలంలో 5.4 మి.మీ, రొళ్ల 4.2, అగళి 4.2, హిందూపురం 4.2, రొద్దం 1.8, పుట్టపర్తి మండలంలో 1.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గోరంట్ల, ఓడీ చెరువు, చిలమత్తూరు తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. రానున్న నాలుగు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, హిందూపురంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లగా...మురుగు నీరు రోడ్లపైకి చేరింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. దీంతో పాదచారులు, వాహనదానదారులు ఇబ్బందులు పడ్డారు.

పిడుగుపాటుకు నలుగురికి గాయాలు

హిందూపురం: హిందూపురం పట్టణ సమీపంలోని మోత్కుపల్లి వద్ద పిడుగుపడి నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి వర్షం రాగా, రాకేష్‌రెడ్డి, ఫణిత్‌కుమార్‌, తరుణ్‌, వంశీ మోత్కుపల్లి సమీపంలోని చింతచెట్టు కిందకు చేరారు. చెట్టుపై పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న నలుగురూ గాయపడ్డారు. రాకేష్‌ కడుపు, నడుము భాగంలో, ఫణిత్‌కు గొంతుకు, తరుణ్‌కు తొడభాగంలో గాయాలయ్యాయి. వంశీ సొమ్మసిల్లిపడిపోయాడు. వీరిని కుటుంబ సభ్యులు, స్నేహితులు హిందూపురం ప్రభుత్వ తరలించి చికిత్స అందిస్తున్నారు.

7 మండలాల్లో వర్షం1
1/3

7 మండలాల్లో వర్షం

7 మండలాల్లో వర్షం2
2/3

7 మండలాల్లో వర్షం

7 మండలాల్లో వర్షం3
3/3

7 మండలాల్లో వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement