
ఖరీఫ్ పెట్టుబడికి పాట్లు
మడకశిర: జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పదునైన వర్షం పడుతుండడంతో ఖరీఫ్ – 2025 సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.13,500 ఠంచన్గా అందడంతో సకాలంలో పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామన్న ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయంపై ఇంతవరకూ స్పష్టత లేదు. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పంటలు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పంటలు 2,69,152 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం..
ఖరీఫ్లో వ్యవసాయం చేయడానికి రైతులకు పెట్టుబడి చాలా ముఖ్యం. ప్రధానంగా భూములను దుక్కి దున్ను కోవడం నుంచి విత్తు వరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసే భూములను దుక్కి చేసుకోవడానికి ట్రాక్టర్కు గంటకు అద్దె రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విత్తనాలు, ,క్రిమి సంహారక మందుల కొనుగోలుకు కూడా డబ్బు అవసరం. కూలీల ఖర్చులు రూ.వేలల్లోనే ఉంటాయి. ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేయడానికి రైతులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఖరీఫ్–2025 పంటల సాగు అంచనా..
మొత్తం సాగు అంచనా: 2,69,152 హెక్టార్లు
వేరుశనగ: 1,51,824 హెక్టార్లు
కంది: 28,925 హెక్టార్లు
మొక్కజొన్న: 17,949 హెక్టార్లు
అమలుకు నోచుకోని అన్నదాత సుఖీభవ
గత ప్రభుత్వంలో ఠంచన్గా
పెట్టుబడి సాయం
నేడు పంటలు పెట్టేందుకు డబ్బు లేక
రైతుల అగచాట్లు

ఖరీఫ్ పెట్టుబడికి పాట్లు